తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తాగునీటి సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తులో విశ్వనగరంగా ఎదగాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నగర శివార్లలో రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. …
Read More »చుక్కా సత్తయ్య పేరు నిలిచేలా…ప్రభుత్వం చర్యలు..ఎంపీ కవిత
ప్రఖ్యాత ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మరణం తీరని లోటని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని స్వగ్రామమైన మాణిక్యపురంలో చుక్క సత్తయ్య పార్థీవదేహాన్ని సందర్శించి ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా సత్తయ్య మృతి పట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఓగ్గు కళకే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలంగాణకు …
Read More »ఉద్యమ సమయంలో పోరాడిన దాన్ని నేడు నేనే పూర్తిచేయడం నా అదృష్టం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది .దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చనాక – కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ రూరల్ మండలలాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. …
Read More »రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయం బయటపెట్టిన రమణ
తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననే ప్రకటిస్తున్న రేవంత్ నిజాలు దాస్తున్నారని ఎల్.రమణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ పదవికి రాజీనామా చేయలేదని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని రమణ సంచలన …
Read More »రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …
Read More »కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ఎంతో మేలు
వైద్యారోగ్య శాఖను పరిపుష్టం చేశామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సిజేరియన్ శస్త్ర చికిత్సల వల్ల ఆస్పత్రుల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఉద్ఘాటించారు. గతంలో ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి ప్రయివేటు ఆస్పత్రులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ …
Read More »టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …
Read More »మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెండు మత్స్య పరిశ్రమ కళాశాలలు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లాలోని లోయర్ …
Read More »రేవంత్రెడ్డికి ఎంపీ బాల్క సుమన్ సవాల్
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సవాల్ విసిరారు.దమ్ము, ధైర్యముంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను మధుసూదనాచారికి సమర్పించాలని అన్నారు . గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఉట్టికి ఎగురలేని వాడు, స్వర్గానికి ఎగిరినట్టు రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. రాజీనామా లేఖ ఏపీ సీఎంకు కాకుండా తెలంగాణ స్పీకర్కు ఇవ్వాలన్న సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ …
Read More »నేడు జేపీ దర్గాకు సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జహంగీర్పీర్ దర్గాలో శుక్రవారం న్యాజ్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దర్గాలోని బాబాల సమాధుల వద్ద సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేసి, దట్టీల ను సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గాలోకి సీఎం వెళ్లేందుకు ప్రత్యేక తాత్కాలిక దారి, దర్గా ఆవరణలో న్యాజ్ …
Read More »