వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …
Read More »Virat Kohli అభిమానులకు షాకింగ్ న్యూస్
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా ఆడనున్న 3 వన్డేల సిరీస్ కి విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్క అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన కోహ్లి.. వన్డేల్లో ఆడనని బీసీసీఐకి తేల్చి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు సౌతాఫ్రికా బయల్దేరడానికి ఇప్పటికే భారత జట్టు ముంబైలోని హోటల్లో ఉండగా.. కోహ్లి ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్సీ విషయం టీంలో కోల్డ్ వార్కు దారి తీసిందనే చెప్పాలి.
Read More »లియాండర్ పేస్తో కిమ్ శర్మ
టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్తో .. కిమ్ శర్మ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఇటీవల అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను కిమ్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. బాయ్ఫ్రెండ్ లియాండర్తో దిగిన ఫోటోలకు కిమ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ కలిగే ఫీలింగ్ మరెక్కడా ఉండదని, గోల్డెన్ టెంపుల్కు వెళ్లడం దీవెనలుగా భావిస్తున్నట్లు కిమ్ తన పోస్టులో చెప్పింది. …
Read More »టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్ననాథన్ లియన్
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అతను అందుకున్నాడు. డేవిడ్ మలన్ను ఔట్ చేయడంతో 34 ఏళ్ల నాథన్ లియన్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా తరపున లియన్ 101వ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెటర్లలో లియన్ 16వ బౌలర్ కావడం …
Read More »యాషెస్ సిరీస్లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 297 రన్స్కు ఆలౌటైంది. కేవలం 20 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో ఆ టార్గెట్ను చేరుకున్నది. దీంతో సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు బోర్డు ఇంగ్లండ్ 147 & …
Read More »147 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్
యాషెస్ సిరీస్లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జట్టు కేవలం 147 రన్స్కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్, స్పీడ్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే.. రోరీ బర్న్స్ క్లీన్ బౌల్డయ్యాడు. …
Read More »ముంబై ఇండియన్స్ 4గుర్నే తీసుకుంది..
ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?
పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.
Read More »CSK ఎవర్ని రిటైన్ చేసుకుందో తెలుసా..?
ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?
కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.
Read More »