మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ …
Read More »మరో ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ (5,065) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ధోనీ (4,520), రాహుల్ ద్రావిడ్ (3,998), సౌరభ్ గంగూలీ(3,468) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read More »భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్
మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి సాధారణ బ్యాటర్గా బరిలో దిగనున్నాడు. కెప్టెన్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ …
Read More »విరాట్ కోహ్లి ప్రకటనపై బీసీసీఐ స్పందన
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. ‘కోహ్లికి ధన్యవాదాలు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు. 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచావు కోహ్లి’ అని బీసీసీఐ తెలిపింది.
Read More »ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌట్
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ 188 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. క్రిస్ వోక్స్(36), రూట్ (34), బిల్లింగ్స్ (29), మలాన్(25) క్రావ్ (18) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ (4వికెట్లు), స్టార్క్ (3వికెట్లు), బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 303 …
Read More »సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియా బయట 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు. * మంజ్రేకర్ 118(వెస్టీండిస్ పై కింగ్ డన్ లో ) * రాత్రా 115*(వెస్టీండిస్ పై, సెయింట్ జాన్స్ లో 2002) * సాహా 104 (వెస్టీండిస్ పై, గ్రాస్ ఐలెట్ లో 2016) …
Read More »టీమిండియా 198 పరుగులకి ఆలౌట్
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 67.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 211లీడ్ సాధించింది. పంత్ 100తో రాణించాడు. మిగితా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్ల చొప్పున తీశారు. అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా …
Read More »70రన్స్ లీడ్ లో టీమిండియా
ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3వ టెస్టులో 2వ రోజు ఆట పూర్తయింది. 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్టంప్స్ సమయానికి 2వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. రాహుల్-10, మయాంక్-7 మరోసారి విఫలమయ్యారు. కోహ్లి-14, పుజారా-9 క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. పేసర్ బూమ్రా.. సఫారీల నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 223రన్స్ చేసింది. ప్రస్తుతానికి 70రన్స్ లీడ్ ఉంది.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Read More »