Home / SPORTS (page 148)

SPORTS

ఈరోజు ఆడే ఆఖరి ఆట…. ఆశిష్‌ నెహ్రా

2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌. మొదట భారత్‌ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్‌, శ్రీనాథ్‌ బాగానే బౌలింగ్‌ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్‌ హుస్సేన్‌,వాన్‌ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్‌ మార్పు చేశాడు గంగూలీ. అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్‌.. అంతకుచిక్కని స్వింగ్‌.. బ్యాట్స్‌మెన్‌ …

Read More »

టీంఇండియా చేతిలో పాక్ భవిష్యత్తు ..

రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ …

Read More »

విరాట్‌ కోహ్లీ మరో రికార్డు ..

టీంఇండియా క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలతో మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద …

Read More »

ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మధ్యాహ్నం గుండెపోటు రావడంతో నగరంలో ఒక ప్రధాన ఆస్పత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో వరకూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం …

Read More »

అమ్మాయిల్లో అగ్రస్థానం…

భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్‌ వన్‌కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్‌ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్‌ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్‌ ఎలీస్‌ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్‌వైట్‌ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్‌ …

Read More »

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత తెలుగు తేజం..

తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ మరోసారి సత్తా చాటాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో(జపాన్‌)ను శ్రీకాంత్‌ ఓడించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. వరుసగా రెండు సెట్లలో 21-14, 21-13 తేడాతో విజయ కేతనం ఎగురవేశాడు. గత వారం డెన్మార్క్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్‌.. వరుసగా రెండో టైటిల్‌ …

Read More »

రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ75

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ …

Read More »

మూడో వన్డేలో గబ్బర్‌ సింగ్ ఔట్

కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన …

Read More »

ప్రొ కబడ్డీలో వరుసగా మూడోసారి టైటిల్

ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌ తుది పోరులో పట్నా పైరేట్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 54- 38 తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి టైటిల్ సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి 21- 18 ఆధిక్యంతో నిలిచిన పట్నా రెండో భాగంలోనూ అదే జోరు కొనసాగించింది. ఈ సీజన్‌లో 350 రైడింగ్ పాయింట్లు సాధించిన స్టార్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ …

Read More »

ముంబయి ఇండియన్స్‌కు పాండ్య … వీడ్కోలు

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌, హార్డ్‌హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం. ఐపీఎల్‌-2018 మెగా వేలంలో పాల్గొనేందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్‌ 4న ఐపీఎల్‌-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది. కన్నేసిన బెంగళూరు గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ విజేతగా నిలవడంతో హార్దిక్‌ పాండ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat