గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Read More »హైదరాబాద్లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు
తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ఆర్వోబీలను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. కరోనా లాక్డౌన్లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు, 300 …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-GHMCలో ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్లో రూ. 250 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 20 వేల లీటర్ల సురక్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గిందన్నారు. నగర ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ …
Read More »ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్: మంత్రి హరీశ్ రావు
జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి హరీశ్ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని …
Read More »కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు వీళ్ళే..!
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ క్యూలైన్లో బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఓల్డ్ మలక్పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్అలీ, మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 46 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,257 కరోనా కేసులు నమోదయ్యా యి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »