తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే సందడి..చిలిపి అల్లరి మాములుగా ఉండదు. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా వెళ్తుంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె షోకి వెళ్తే మాత్రం షో లో రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు. అందుకే ఈమధ్య శ్రీముఖి తన గ్లామర్ పై …
Read More »కోడెలకు మరో షాక్.. !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …
Read More »లోకేశ్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్లు పెడుతున్నారంట
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేశ్ ట్వీట్లు ఆయనే చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో తెలియదన్నారు.ఆయన ట్వీట్ లు అర్దం ,పర్దం లేకుండా ఉంటున్నాయని అనిల్ ఎద్దేవ చేశారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు ..వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి …
Read More »జగన్ వేట మొదలైంది..తిరుపతిలోనారాయణ జూనియర్ కాలేజ్ సీజ్..!
వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా …
Read More »‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’టీచర్ పైశాచికం
సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూస్తే ఓ విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే …
Read More »శివాజీ పాస్పోర్టును సీజ్ చేసిన పోలీసులు
అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద …
Read More »సెమీఫైనల్లోకి టీంఇండియా.. కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్…!!
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీంఇండియా విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్కు చేరిన భారత జట్టుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచేందుకు జట్టు మరో రెండు మ్యాచ్ల విజయాల దూరంలో ఉందని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. స్వయంగా క్రికెట్ అభిమాని అయిన కేటీఆర్.. క్రికెట్ మ్యాచ్ల …
Read More »దేశం దాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు
హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి సైబరాబాద్ క్రైమ్ పీఎస్కు తరలించారు. అలందా మీడియా పెట్టిన కేసులో శివాజీని అరెస్ట్ చేశారు. టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ …
Read More »సీఎం జగన్మోహన్రెడ్డిని అభినందించాలి..కిల్లి కృపారాణి
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల పాలనపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్చార్జ్ కిల్లి కృపారాణి అన్నారు. గత ప్రభుత్వ పాలనలోని అవినీతి వెలికి తీసి, అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకుంటే దానిని కక్ష సాధింపు చర్య అని ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినీతి రహిత, పారదర్శక, …
Read More »