Home / KSR (page 54)

KSR

మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన.. మందుల కొరత లేదు..!!

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. నాలుగు రోజుల్లో 10 జిల్లాలలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ప్రజలు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదని వస్తున్న జ్వరాల్లో 90 శాతం జ్వరాలు సాధారణ జ్వరాలని , కేవలం 10 శాతం మాత్రమే …

Read More »

మహిళా, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం..!!

మహిళా, శిశు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ రోజు మహిళా, శిశు- సంక్షేమ శాఖ కమిషనరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గిరిజన మహిళ అయిన నాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖలు ఇచ్చి గురుతర బాధ్యతను అప్పగించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, …

Read More »

ఉద్యోగాల కల్పనే లక్ష్యం..కేటీఆర్

పరిశ్రమలు, ఐటీ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్ల అపారెల్‌ పార్క్‌లతో పాటు ఇండస్ట్రియల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధ్యమైనన్ని పెట్టుబడులు తేవాలని అధికారులకు సూచించారు. రానున్న నాలుగేళ్ల …

Read More »

పార్ల‌మెంటుకు కొత్త‌ భ‌వ‌నం…బీజేపీ ఇక‌నైనా మారుతుందా?

తెలంగాణ‌లో నూత‌న స‌చివాల‌యం నిర్మాణపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం కొత్త పార్ల‌మెంటు నిర్మాణానికి సిద్ధ‌మ‌వుతోంది. 2022లో భార‌త స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేప‌థ్యంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వనాన్ని నిర్మించాల‌న్న ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని తెలుస్తోంది. ఢిల్లీలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మించాలా లేక ఉన్న బిల్డింగ్‌ను మ‌రింత ఆధునీక‌రించాలా అన్న ఆలోచ‌న‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. …

Read More »

ఖ‌మ్మంలో తొలిసారి అడుగుపెట్టిన మంత్రి పువ్వాడ ఏం చెప్పారంటే…!!

రవాణాశాఖ మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్న సీనియ‌ర్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారి ఖ‌మ్మంలో ప‌ర్య‌టించారు.ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో జరిగిన టీఆర్ఎస్ స్వాగత సభలో మంత్రి అజయ్ పాల్గొని ప్రసంగించారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అందరినీ కలుపుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. …

Read More »

దుమ్మురేపుతున్న గోపీచంద్ ‘చాణ‌క్య‌’ టీజ‌ర్..!!

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. యాక్ష‌న్ ప్యాక్‌డ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌, పోస్ట‌ర్స్‌తో పాటు ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌తో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం …

Read More »

రబీకి యూరియా సిద్ధం చేయండి.. మంత్రి నిరంజన్‌ రెడ్డి

సోమవారం హాకాభవన్‌లో యూరియా సరఫరా అవుతున్న తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారం సేకరించండి. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు …

Read More »

తెలంగాణ పథకాలకు నూతన గవర్నర్ ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలకు తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్‌ అధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే …

Read More »

11న మండలి చైర్మన్ ఎన్నిక..మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజుల …

Read More »

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు.. మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. నగరంలో జ్వరాల తీవ్రత, తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat