ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ పారిశ్రామిక రంగం కొత్త రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషి కారణమన్నారు. గత ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, అందులో …
Read More »హుజుర్నగర్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్కు వైసీపీ మద్దతు..!!
హుజూర్ నగర్ లో గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి అద్భుత స్పందన లభిస్తోంది. ఊరూరా సైదిరెడ్డికి జనం ఘనస్వాగతాలు పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ… జై టీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజుర్నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డిని కలిసి ఉప ఎన్నిక ఇంఛార్జ్ …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు మేలు.. మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు మేలు జరిగిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి శనివారం నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్, కల్మటి తండా, పెద్ద తండా, దేవుల తండా, రాఘవపురం, మీగడం పహాడ్ తండా, చెరువు తండా, బెట్టె తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను కోరారు. …
Read More »దీపావళికి జీడిమెట్ల సి అండ్ డి ప్లాంట్ ప్రారంభం..కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రతి వార్డు, సర్కిళ్లవారిగా శానిటేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, నగర శివార్లలో డంపింగ్ యార్డ్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో శానిటేషన్ నిర్వహణ, రవాణా, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, …
Read More »సద్దుల బతుకమ్మా.. టాంక్బండ్పై భారీ ఏర్పాట్లు..!!
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్బండ్పై ఆదివారం నాడు భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్బండ్ వరకు నిర్వహించే బతుకమ్మ శోభయాత్ర జరిగే రహదారితో పాటు బతుకమ్మలను నిమజ్జనంచేసే బతుకమ్మఘాట్లో ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. బతుకమ్మలచే ర్యాలీ జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రతను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో 6వేల మంది మహిళలు జీహెచ్ఎంసీ …
Read More »గిరిపోషన్ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాలకూ విస్తరిస్తాం..మంత్రి సత్యవతి
గిరిజన ప్రాంతాల్లోని పిల్లల్లో, మహిళల్లో పోషకాహార లోపం అధిగమించే విధంగా అంగన్ వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని గిరిజన సంక్షేమ శాఖ పనిచేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోషన్ అభియాన్ పథకం కింద అమలు చేస్తున్న గిరిపోషన్ పథకం పనితీరుపై, అమలులోని ఇబ్బందులపై మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ అధికారులు, సిబ్బందితో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో …
Read More »కొత్త మద్యం పాలసీ.. లైసెన్స్ ఫీజుల వివరాలు ఇవే..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కొత్త మద్యం విధానం ప్రకటించింది. ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న …
Read More »గ్రామంలో పచ్చదనం , పరిశుభ్రత పాటించాలి..మంత్రి హరీష్ రావు
గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కొలుగురు గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. నెలలోగా గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలి. గ్రామంలో స్మశాన వాటిక పెండింగ్ పనులకు మరో 10 లక్షలు మంజూరు చేస్తాం. …
Read More »హుజూర్నగర్ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలి..!!
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో గులాబీ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో సైదిరెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సైదిరెడ్డి ధీమా …
Read More »ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు..కేటీఆర్
రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని తెలిపారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించండి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని కేటీఆర్ అన్నారు.
Read More »