విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలను ఓ రూపంలోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి …
Read More »ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వికారాబాద్ ఎమ్మెల్యే
టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీనెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బుధవారం వికారాబాద్ బస్టాండ్ కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్టాండులో మంచినీటి కొరత లేకుండా చూడాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి హరితహారం …
Read More »మంచి మనస్సును చాటుకున్న మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మంచి మనస్సును చాటుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ మార్గ మధ్యలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద లారీ బైక్ను ఢీకొని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఆయన జరిగిన సంఘటనను చూసి వెంటనే తన వాహనం ఆపి ప్రమాదంలో గాయపడిన వారితో అక్కడే మాట్లాడి …
Read More »టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక..మంత్రి కేటీఆర్
టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్ ఒక రోజంతా చర్చించి.. టీఎస్ ఐపాస్కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక …
Read More »దివ్యాంగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..మంత్రి కొప్పుల
దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వరల్డ్ డిసెబుల్ డే సందర్భంగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగగా ఈ కార్యక్రమానికి కొప్పులతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజతో పాటు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన దివ్యాంగులకు అవార్డ్స్ అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు …
Read More »కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..!!
ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్ రాసిన వినతి పత్రాలను కేంద్రమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గతంలో రాష్ర్టానికి 3,150 …
Read More »ఎంపీ సంతోష్ పై సీనియర్ ఐఏఎస్ అధికారి అధర్ సిన్హా ప్రశంసలు..!!
వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభమౌతుందని ఎం.పీ సంతోష్ కుమార్ నిరూపించారని, గ్రీన్ ఛాలెంజ్ రూపంలో హరిత తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పొలిటికల్) అధర్ సిన్హా. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో మూడు మొక్కలు నాటిన అదర్ సిన్హా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజా …
Read More »రాములు కుటుంబానికి భరోసానిచ్చిన మంత్రి హరీష్ రావు
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అల్లిపూర్ సొసైటీ చైర్మన్ , సీనియర్ జర్నలిస్ట్ రాములు కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పత్రికా రంగంలో ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. పార్టీ లో క్రియాశీలకంగా పని చేసారు అని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమన్నారు. అధైర్య పడకండి అన్ని విధాలుగా అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు, పిల్లల చదువు, ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదేనని.. నేను ఉన్నాను అని కుటుంబాని …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..!!
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం తన నివాసంలో కలిసిన యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ ( యుసిసిసి ) ప్రతినిధులతో వినోద్ కుమార్ సమావేశమయ్యారు. క్రిస్టియన్ లకు జెరూసలేం పవిత్ర యాత్ర కు వెళ్లేందుకు ప్రభుత్వ పరంగా రాయితీ ఇప్పించాలని యూసిసిసి ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »త్వరలో పౌల్ట్రీ పాలసీ.. మంత్రి తలసాని
దేశంలోనే అత్యున్నతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పౌల్ట్రీ రంగం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ …
Read More »