పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ దళితుల విషయంలో చేసిన ట్వీట్పై ఘాటుగా స్పందించారు మహేష్. దళితులందరూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్షాన నిలిచినా.. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించారు.‘పవన్ కళ్యాణ్కు తెలీని నిజం ఏమిటంటే.. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఓట్లన్నీ ఈసారి జగన్ గారికే పడ్డాయి.ముఖ్యంగా రాయలసీమలో ఒకటో రెండో సీట్లో తప్ప అన్నింటా వైసీపీనే గెలిచింది. ఈ రాష్ట్రానికి మొదటిసారిగా ఒక దళిత మహిళ హోంశాఖామంత్రి అయ్యింది. దళితుల పైన దాడి జరిగితే అత్యంత వేగంగా రెస్పాండ్ అవుతున్న ప్రభుత్వం ఇది’అంటూ కొన్ని ఉదాహరణల్ని కత్తి మహేష్ ప్రస్తావించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కకెళ్లి ఆడుకొమ్మనండి.. చాలా చిరాకేస్తోంది అన్నారు.
వీడొక సోదినాయాలు! వీడికి తెలీని నిజం ఏమిటంటే…రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఓట్లన్నీ ఈసారి జగన్ గారికే పడ్డాయి.ముఖ్యంగా…
Posted by Mahesh Kathi on Sunday, 24 November 2019