తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని నాగుల బండ పరిధిలో నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణ పనులను ఎల్వి ప్రసాద్ సంస్థ చైర్మన్ డా.జి ఎన్ రావుతో ఆయన కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ… ఈ ప్రాంతానికి ఈ ఆసుపత్రి రావడం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్ కు వెళ్లకుండా కంటి చికిత్స లు చేసుకొనే ఆవకాశం మన సిద్దిపేటలోనే రాబోతుందని ఆయన అన్నారు. అసుపత్రి నిర్మాణ పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు , నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు.డిసెంబర్ నెలలో ప్రారంభానికి సిద్ధం చేయాలని , ఆదిశగా మిగులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు చెప్పారు..డిసెంబర్ 15 న ప్రారంభం చేసుకుందాం, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి , చెట్లు నాటాలని మంత్రి సూచించారు.
