వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని అరవడం’ చంద్రబాబు గారికి 40 ఏళ్లుగా అలవాటే. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించింది ఆయనే. ఇవ్వాళ తనే బాధితుడినన్నట్టు కుల మీడియాలో శోకాలు పెడుతున్నాడు. తన వరకు వస్తే బాధేమిటే తెలియలేదు సారుకి అని అన్నారు.
1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం పట్టుకుంది @ncbn గారికి. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 5, 2019