గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది.
ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు మహిళను నమ్మించాడు.
గూగుల్ పే కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ ను ఆమెకు పంపించి తాను ఒక నెంబర్ నుంచి మెసేజ్స్ పంపుతాను. వాటిని యాక్సెప్ట్ చేయమని కోరాడు. గూగుల్ పే లోని రిక్వెస్ట్ ఆప్షన్ ను ఎంచుకుని ఐదు విడతలుగా ఆమె ఖాతా నుంచి ఏకంగా తొంబై వేల రూపాయలను గుంజుకున్నాడు ప్రబుద్ధుడు..