జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆదిమూలపు సురేష్ ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వరుసగా 2009, 14, 19 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుపై 31,096 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో వైఎస్సార్ ప్రోత్సాహంతో యర్రగొండపాలెంనియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2014 ,19 ఎన్నికల్లో అదేస్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2009లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడుగా, 2014లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఈయన ఐఆర్ఎస్ చదువుకున్నారు.ఈయనకు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది.
