ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలా దిగిపోవడంతో.. దాని ప్రభావం నామినేటెడ్ పోస్టులపై పడుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారం ఓ పార్టీ నుంచి మరో పార్టీకి చేతులు మారినప్పుడు.. అధికార పార్టీ నామినేట్ చేసిన పదవుల్లో వారు కూడా రాజీనామాలు చేయడం పరిపాటే. తాజాగా.. డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిది కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గత నెల 30న తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పంపారు. 2014లో కంభంపాటిని అప్పటి టీడీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది.
