వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత కొండా మురళి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.ఇవాళ అయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శనివారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ను ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా..గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.. అయితే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ.. శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన చేయడంతో.. కొండా తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.కొండా మురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా ఉన్నారు.
