Home / SLIDER / తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శం..

తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శం..

తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. అందుకే విద్యార్థులు పొద్దున నిద్ర లేవగానే తమ అమ్మా-నాన్నకు దండం పెట్టినట్లే…ఇన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్న సిఎం కేసిఆర్ కు కూడా దండం పెట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యార్థులకు సూచించారు. తెలంగాణలోని  ప్రభుత్వ, పంచాయతీరాజ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 6 లక్షల మంది విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘‘బాలికా ఆరోగ్య రక్ష’’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు వరంగల్ లోని హసన్ పర్తి గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. నేటి నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన విద్య అందించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తోందన్నారు.

నేడు తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. భారతదేశంలో తెలంగాణ గురుకులాలే పటిష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను తెలంగాణలో ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 296 గురుకులాలుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 517 గురుకుల పాఠశాలలు, 53 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న జిల్లాలు, మండలాల వల్ల తెలంగాణకు కొత్తగా 84 కేజీబీవీలు వచ్చాయన్నారు. తెలంగాణలో 475 కేజీబీవీలుంటే వీటిల్లో ఈ ఏడాది 85 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. అదేవిధంగా విద్యాశాఖలోని 35 గురుకుల పాఠశాలలను గురుకుల కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. తెలంగాణ విద్యాశాఖ గురుకుల విద్యాలయాల కోసం 150 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యాశాఖలో మౌలిక వసతులు కల్పిస్తూనే టీచర్లను కూడా టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎవరికీ తీసిపోకుండా ఉండేవిధంగా నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాశాఖ ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి మెనును ఇస్తున్నామన్నారు. సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నామన్నారు. నెలకు ఆరుసార్లు మాంసాహారం, ఇందులో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ , వారానికి 4సార్లు గుడ్లు, ఉదయం బూస్ట్ మిల్క్, రాగిమాల్ట్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనంలో 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి మంచి భోజనం అందిస్తున్నామన్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం బాలికా ఆరోగ్య రక్ష పథకం కింద హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామన్నారు. ఈ కిట్లో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అవసరమైన 14 రకాల 50 వస్తువులున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏయే వస్తువులు కొంటారో, తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం అమ్మ-నాన్న వలె ఆలోచించి అన్ని వస్తువులు అందిస్తోందన్నారు. ఈ పథకం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఒక్కో విద్యార్థికి ఈ కిట్ కోసం 1600 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏడాదికి 12 నెలలు సరిపోయే విధంగా మూడు నెలలకొకసారి కిట్ ఇస్తామన్నారు. ఇలాంటి పథకంగానీ, భోజనంగానీ విద్యాలయాల్లో దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. అందుకే ఇంత నాణ్యమైన విద్య, ఆరోగ్యం కోసం మంచి మెను, హెల్త్ కిట్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కు నిద్ర లేవగానే తల్లిదండ్రులకు దండం పెట్టినట్లు ఆయనకు దండం పెట్టాలన్నారు.

తెలంగాణలో పటిష్టమవుతున్న విద్యావ్యవస్థ గురించి గొప్ప విద్యావేత్త చుక్కా రామయ్య కూడా ఇటీవల కథనాలు రాశారని చెప్పారు. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల కు విద్యార్థులు వచ్చే విధంగా ప్రభుత్వ విద్య పటిష్టం అయిందన్నారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ తెలంగాణ వచ్చిన తర్వత పటిష్టం దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. కేజీ టు పీజీలో భాగంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వసతులు వినియోగించుకోవాలని, మంచి ఫలితాలు సాధించి వారి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కార్పోరేటర్లు, కలెక్టర్లు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొని విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసి పథకాన్ని గొప్పగా ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్, రైతు రుణ విముక్త కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, విద్యాశాఖ సంచాలకులు విజయ్ కుమార్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ మల్లేషం, వరంగల్ డీఈవో నారాయణరెడ్డి, స్థానిక నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat