సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక సింధు దారుణ హత్యకు గురైంది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక సింధు బుధవారం అదృశ్యమైంది. కాగా… ఆ గ్రామానికి సమీపంలోగల ఓ బావిలో బాలిక మృతేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం బయటకు తీసి చూడగా నిన్న అదృశ్యమైన సింధుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాలికను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
