నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ పార్టిలో చేరుతారన్న ఉహగాణాల్ని మంత్రి జగదీష్రెడ్డి కొట్టి పారేశారు. నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో …ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదన్నారు. అటువంటి వారు చేరాల్సింది టీఆర్ఎస్ పార్టిలో కాదు మానసిక వైద్యుడి దగ్గర అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు .
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అంటే ప్రజలు భయపడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనతో అధికార పార్టీ బయపడుతుందన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ కొరవడిందని, అటువంటి సమయంలో జరుగుతున్నా రాహుల్ గాంధీ పర్యటనకు జనం రారని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ఈ తరహ ప్రచారానికి ఓడిగడుతున్నారని మంత్రి అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం జరిగిన తొలి,మలి ఉద్యమంలో వందలాదిమందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అంటే ప్రజలలో ఇప్పటికి అదే భయం ఉందంటుందన్నారు. రాహుల్ గాంధీ అంటే ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే భయపడరని అటువంటిది తెలంగాణా రాష్ట్రంలో ఎందుకు భయపడుతారంటు మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.