ఈ మధ్య ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
see also:నిద్రిస్తున్నసోంత చెల్లిని అన్న.. అతి దారుణం..!
అయితే ఈ ఘోర ప్రమాదంపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.