ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును లక్ష కోట్ల దొంగ విమర్శించడమా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనిత. కాగా, ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఏపీ పార్టీలు రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రానివ్వకుండా అడ్డుకున్నాయన్నారు.
మరో పక్క సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం చేసే సాయం కోసం ఆలోచించకుండా రాజధాని అమరావతి నిర్మాణం నుంచి.. రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే అనిత. ఒక దళిత ఎమ్మెల్యే అయిన తనను రాజకీయంగా ఎదగనీయకుండా వైసీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ బీజేపీతో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రత్యేక హోదా సాధన కో సం కృషి చేస్తున్న చంద్రబాబుకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఎమ్మెల్యే అనిత.