ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ శ్రేణుల ,వైఎస్సార్ అభిమానుల భవిష్యత్తు ఆశాకిరణం అన్నిటికి మించి రానున్న కాలంలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి.దేశంలోనే ఎనబై కోట్లకు పై ఇన్కమ్ ట్యాక్స్ ముందే కడుతున్న పెద్ద పారిశ్రామిక వేత్త ..అట్టడుగు వర్గాల పాలిట దేవుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్మోహన్రెడ్డి, అటు ప్రతిపక్ష నేతగా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగానే కాకుండా.. ముఖ్యమంత్రిని మించిన జనాదారణ జగన్కు సొంతం. ఇందుకు నిదర్శనంగా ఇటీవల వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు అశేషంగా పాల్గొనడమే. అయితే. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 138వ రోజు కొనసాగుతోంది. అయితే, ఆదివారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఓ కుమ్మరి వద్దకు వెళ్లి.. అతని పనిలో జగన్ కూడా ఓ చేయి వేశాడు. ఓ కుండను సైతం జగన్ తయారు చేయడం విశేషం. దీన్ని చూసిన అక్కడి జనమంతా.. మట్టిని తాకేందుకు కూడా ఇష్టపడిన రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో .. బురద మట్టిలో చేయి పెట్టి.. అందులోనూ కుమ్మరి చేస్తున్న పనిలో తాను ఓ చేయి వేసి..జగన్ కుండ తయారు చేయడం.. చెప్పుకోదగ్గ విషయమేనని చర్చించుకోవడం విశేషం.