జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రత్యేక హోదా కాదు నిధులే ముఖ్యమని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
see also :పల్లెటూరి చీరకట్టులో అనసూయ అందాలు..!
see also :మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతూ.. 40 మంది ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే లు తనకు చెప్పారని, తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. అయితే ప్రత్యేక హోదా నినాదం వదిలి ప్రత్యేక సాయం చేయాలని మోడీ సర్కార్ ను పవన్ కళ్యాణ్ కోరడంపై పలు అనుమానాలు వస్తున్నాయని, ఆయన బిజెపితో కుమ్మక్కయ్యారని అధికార టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.