Home / ANDHRAPRADESH / అనంతపురంలో 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర..కని పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురంలో 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర..కని పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీకి చంద్రబాబు అసమర్థత వల్లే అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రతి పక్షనేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు. టెండర్‌ ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. మరో వైపు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయేలో కొనసాగుతూనే నిరసన తెలియజేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ప్రజా సంక్షేమం కన్నా రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat