Politics భారత రాష్ట్రపతి ద్రౌపది మర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈనెలా కరుణ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు..
భారత రాష్ట్రపతి ద్రౌపది మురము ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమెను… పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి జిల్లాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు అయితే ఇక ఈ నెల 26వ తారీఖున మళ్లీ ఆంధ్రప్రదేశ్కు రానున్న ద్రౌపది మురము నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంకి ఉన్న ప్రత్యేకతను తెలుసుకొని ఆమె రాష్ట్రానికి రానున్నారు
అలాగే ఈ నెల 26వ తేదీన ఆమె శ్రీశైలంలో పర్యటించనున్నారు. 12:15 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారు.. నిత్యం తిరుమలకు ఎందరో భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారు బ్రమరాంబ మల్లికార్జున స్వామిని శ్రీశైలాన్ని తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు ఇలాంటి వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం దానికి మరిన్ని సౌకర్యాలను కల్పించడానికి శ్రీకారం చుట్టనున్నారు..