Political రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని శతవిధాల వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. అలాగే ప్రభుత్వ పాలనకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు సహాయపడుతున్నారని అన్నారు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొన్ని పత్రికలు వాలంటీర్ల వ్యవస్థ పై దుష్ప్రచారం చేస్తున్నాయని తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు ప్రభుత్వ పాలనకు తమదైన రీతిలో వాలంటీర్లు సహాయం చేస్తున్నారని వారి సహాయంతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని అన్నారు… తమ ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అతి చేరువగా సేవలందిస్తోందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. లంచాలకు అవకాశం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందతున్నాయని చెప్పారు.
“చంద్రబాబు నాయుడు మోచీతి నీళ్లు తాగే కొన్ని పత్రికలు.. ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నాయి..
అలాగే చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికే పెన్షన్లు. జగన్ హయాంలో 42 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు తప్పు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు.చంద్రబాబుతో ఇదేం కర్మ అంటూ ప్రజలు తలకొట్టుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణం ” అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు..