విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి మూవీపై దృష్టి సారించాడు. పుష్ప సినిమాతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న రష్మిక ఇటీవల సూపర్ హిట్ అయిన సీతారామంలో కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లోనూ వరుస ప్రాజెక్టులు ఓకే చేసేస్తోంది. ఆమితాబచ్చన్తో కలిసి నటించిన గుడ్బై మూవీ మంచి టాక్ దక్కించుకుంది. దీంతో విజయ్ రష్మిక వర్క్ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఎయిర్పోర్టులో కనిపించారు.