త్వరలో ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు బుక్ మై షో వెల్లడించింది.
ఒక్కో టికెట్ రేట్ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఐపీఎల్ మ్యాచ్లకు స్టేడియం కెపాసిటీలో కేవలం 25 శాతం మందినే అనుమతించనున్నారు. ఆ మేరకే టికెట్లను అందుబాటులో ఉంచే అవకాశముంది.
మొత్తం 10 టీమ్లు పాల్గొంటున్న ఈ సీజన్లో 70 మ్యాచ్లు జరగనున్నాయి. ముంబయి, నవీ ముంబయి, పుణె నగరాల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ముంబయిలోని వాంఖడే, బ్రాబౌర్న్ స్టేడియాల్లో 20 చొప్పున, నవీముంబయిలో 15, పుణెలో 15 మ్యాచ్లు జరనున్నాయి.