బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది.
ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య..
అన్నింటికి ప్రిపేరై సినిమా మీద, ప్రేక్షకుల మీద నమ్మకం ఉంచి, ధైర్యం చేశామని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ మూవీ నిరూపించిందని, దీనివల్ల చాలా మంది నిర్మాతలకు ధైర్యం వచ్చిందని ఆయన తెలిపారు.