తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్శన్ సరితకు ఆ పార్టీలో షాకిచ్చారు నేతలు.
సరితకు ఈ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ,ముఖ్య నేతల సమావేశంలో తీర్మానించారు. ఇది మరవకముందే సరిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నేతలు మరోసారి ఆధిష్టానానికి పిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమానికి సరితను కోఆర్డినేటర్ గా నియమించడంతో కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలకు ఆజ్యం పురుడుపోసుకుంది. ఆమెను ఆ పదవి నుండి తప్పించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ,ప్రచార కమిటీ సభ్యుడు కుర్వ విజయ్ కుమార్ లాంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు.