చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అని ఆరోపించారు ప్రభుత్వవిప్ భానుప్రసాద్ . టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు.. మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.
చిల్లర పనులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే హీరోలు నాయకులు కాలేరని భానుప్రసాద్ హెద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు.
ముందు తన పార్టీని చక్కదిద్దుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ బపూన్ . అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడవ్వడం ఆ పార్టీ ఖర్మ. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్. చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ తెలంగాణలో డ్రామాలు ఆడతారని ఆయన అన్నారు.