తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి మరోసారి కృతజ్జతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గురువారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన శాసన సభ్యులు సిఎం కేసీఆర్ ను వారి చాంబర్ లో కలిసి, రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణ మాఫీ నిర్ణయానికి కృతజ్జాతాభివందనాలు తెలిపారు. దాంతో అసెంబ్లీలోని సిఎం చాంబర్ గురువారం నాడు సందడి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సిఎం కేసీఆర్ కు పుష్పగుచ్చాలు అందించి సిఎం కేసీఆర్ గారితో జిల్లాలవారిగా కలిసి ఫోటోలు దిగారు. తమ రైతుల తరఫున ప్రజల పక్షాన సిఎం గారికి ధన్యవాదాలు తెలిపారు.రైతు రుణ మాఫీ తో పాటు హైద్రాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం, తదితర అభివృద్ది సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో సిఎం కేసీఆర్ గారికి కృతజ్జాతిభినందనలు వెల్లువెత్తాయి.
వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసనసభా ప్రారంభానికి ముందే సిఎం గారి రాకకోసం వేచి చూసి వారు రాగానే పూలబొకేను అందించారు. రైతు రుణమాఫీ చేసినందుకు వ్యవసాయ శాఖ తరపున, తెలంగాణ రైతాంగం తరఫున సిఎం కేసీఆర్ కు వ్యవసాయ శాఖ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని సిఎం కు తెలిపారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందనీ, రైతు బాంధవుడుగా సిఎం కేసీఆర్ మరోసారి నిలిచారని, రుణ మాఫీ సంపూర్ణం చేసిన సిఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని వారు కొనియాడారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గారికి… మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్యెల్యేలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు మహమూద్ అలి, శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ ఎమ్మెల్యేలు,..వీరితో పాటు పలువురు సిఎం కేసీఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు