తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు,రేపు అనగా జూలై 26, 27 (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.