తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరుతున్నాను.
కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు , స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులు, సహాయచర్యలను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తూ భరోసానిస్తున్నారు.
అధికారులు లోతట్టు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు భరోసానివ్వనున్నారు అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పోస్టు చేశారు.