రాబోయే లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్(సెక్యులర్) ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా పర్వాలేదని దేవగౌడ తెలిపారు.
బలంగా ఉన్న చోటే తమ అభ్యర్థుల్ని నిలబెడతామన్నారు. అయితే దేవగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి.. కొన్ని రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.