Home / SLIDER / వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

నిన్న మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్‌ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది.

పదో తరగతి వరకు చదువుకొన్న వారికి లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌ (ఆఫీస్‌ సబార్డినేట్‌), ఇంటర్‌ చదివిన వారికి రికార్డ్‌ అసిస్టెంట్‌ లేదా సమానమైన, డిగ్రీ, ఆపై చదివిన వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా సమానమైన పేస్కేల్‌ వర్తింపజేస్తున్నట్టు ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు.ప్రస్తుతం 61 ఏండ్లలోపు వయసున్న 16,758 మందికి పేస్కేల్‌ వర్తించనున్నది. మరో 3,797 మంది వీఆర్‌ఏల వారసులకు కారు ణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 61 ఏండ్లు దాటినవారు, వైద్య కారణాల వల్ల ఉద్యోగాల్లో కొనసాగలేనివారు, 2014 జూన్‌ 2 తర్వాత విధుల్లో ఉండగా మరణించిన వీఆర్‌ఏల వారసులకు విద్యార్హతల ఆధారంగా మూడు క్యాటగిరీల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, వీఆర్‌ఏ జేఏసీ చైర్మన్‌ రాజయ్య, కో చైర్మన్‌ రమేశ్‌ బహదూర్‌, ప్రధా న కార్యదర్శి దాదేమియా, కో కన్వీనర్లు రఫీ, మాధవనాయుడు, వెంకటేశ్‌యాదవ్‌, వంగు రు రాములు, ఎన్‌ గోవింద్‌, ఉమా మహేశ్వర్‌, శిరీషారెడ్డి, సునీత, రాజు, వివిధ జిల్లాల చైర్మ న్లు అజీజ్‌, ఎడ్ల వెంకటేశ్‌, రవీందర్‌, నారాయణ, వెంకటేశ్‌, కొండ రాజేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat