Home / NATIONAL / ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు

ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి.

ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది.

దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నానికి హర్యానాలోని హత్నీకుండ్ ప్రాజెక్టు నుండి నీటిని వదిలే అవకాశం ఉండటంతో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat