Home / SLIDER / మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి

 తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) ఈరోజు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు.

ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్‌ శాసనసభ్యుల నివాసం 272 (ఏ)లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.

సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యుని గా సేవలందించారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ఆ పార్టీ నాయకులుగా, రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం సభ్యులుగా, పలు హోదాల్లో సేవలు అందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat