చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం భీష్మ. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో యువహీరో నితిన్,నేషనల్ క్రష్ రష్మిక జోడీగా రూపొందిన భీష్మ చిత్రం సూపర్ హిట్ గా కూడా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఇందులో భాగంగా జరిగే పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కొత్త చిత్రంలో భీష్ము ను మించి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ‘మైత్రీ మూవీ మేకర్స్’ వెల్లడించింది. కాగా, ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.