తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ”
–> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం
–> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు
–> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే మళ్లీ రద్ధు అయిన పరీక్షలను నిర్వహిస్తాం
–> ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి మొత్తం కోచింగ్ మెటీరియల్స్ ను ఆన్ లైన్ లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతాం
–> రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోచింగ్ కేంద్రాలను బలోపేతం చేసి రీడింగ్ రూమ్స్ ను ఇరవై నాలుగంటలు తెరిచేలా ఆదేశాలిస్తాం.. అంతేకాకుండా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తాం
–> గతేనిమిది సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసిన కమీషన్ టీఎస్పీఎస్సీ
–> ఈ కమిషన్ ద్వారా ముప్పై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన కానీ ఏనాడూ కూడా అవినీతి ఆరోపణలు ఎలాంటి తప్పులు జరగలేదు
–> దాదాపు ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలను నిర్వహించిన ఏకైక కమిషన్ టీస్పీఎస్సీ
–> టీఎస్పీఎస్సీ ద్వారా 155 ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల అయ్యాయి
–> పరీక్ష పేపర్లు లీకేజీ లో ఎంతటి వారున్న కానీ వదిలిపెట్టేది లేదు.. వాళ్లందర్ని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం
–> ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చింది
ఇలాంటి పరిణామాలు మళ్లీ మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
