IT Minister Ktr తాజాగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు..
తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వీహబ్ ప్రతినిధులకు అభినందనలు తెలిపిన కేటీఆర్.. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్తో రూ. 70 కోట్లకు పెంచారు.
అలాగే రాష్ట్రంలో స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. యువత వ్యాపారం వైపు రావాలని అసలు ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు అంటే ప్రశ్నించారు ప్రతి పారిశ్రామిక పార్కులో 10% ఫ్లాట్స్ మహిళలకు కేటాయిస్తామని తెలిపిన కేటీఆర్ ప్రతి మూడు కోవిటికాల్లో రెండు హైదరాబాద్ నుంచి వచ్చాయని మరొకసారి గుర్తు చేశారు. అలాగే స్త్రీ పురుషులకు సమానంగానే ప్రతిభ ఉంటుందని మానవ వనరులు సాంకేతికతను వినియోగించుకోవడంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించాలని ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టమైన విధంగా ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు అలాగే అమ్మాయిలను చదివించాలని ఒకవేళ ఫెయిల్ అయిన వెన్నతటి ప్రోత్సహించాలని అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకు రాగలుగుతారని చెప్పుకొచ్చారు.