Cm Jagan Mohan Reddy ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు.
కాగా ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం.. మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు సీఎంవో నిర్ణయం తీసుకుంది. అలాగే బిఎస్సి సమావేశంలో సమావేశాల్లో షెడ్యూల్ సైతం ఖరారు అయినట్టు తెలుస్తుంది. మార్చి 18న సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన లబ్దదారుల ఖాతాల్లోకి జమ కానున్నట్టు కూడా తెలుస్తోంది..
అలాగే మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు పేర్లు ప్రకటించి వీరికి ఏప్రిల్ 10న అవార్డులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కానుంది. మార్చి 25 నుంచి వైయస్సార్ ఆసరా ఏప్రిల్ 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన ప్రారంభం కానుంది. అలాగే ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కానుంది. ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం జరగా ఏప్రిల్ 18 ఈ బీసీసి నేస్తం అమలు కానుంది..