దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు.
అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీని టేస్ట్ చేశారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.
ముంబయి, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బ్లింకెన్తో పాటు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Who says official motorcades have to be boring? Watch @SecBlinken cruise in style with the longest-serving locally employed staff at the U.S. Embassy in New Delhi. Our famous #AutoGang ? and their signature "autocade" followed close behind. What an entrance! pic.twitter.com/KbhZPybLy8
— U.S. Embassy India (@USAndIndia) March 3, 2023