minister indrakaran: నిర్మల్ లోని దివ్యానగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సమాజ శ్రేయస్సుకు సంత్ సేవాలాల్ చూపిన మార్గం ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
గిరిజనుల అభివృద్ధికి, తండాల నిర్మాణానికి సేవాలాల్ తన జీవితాన్ని త్యాగం చేశారని గొప్ప మహనీయుడని మంత్రి కీర్తించారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా సేవాలాల్ ను గౌరవిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
సేవాలాల్ మహారాజ్ బోధనలు బంజారా జాతి పురోగమానానికి ఉపయోగపడ్డాయని వెల్లడించారు. సేవాలాల్ మాటలను ఆచరించాలని సూచించారు. గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలనే మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి …..గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు.
స్వయం పరిపాలన విధానాన్ని అమలు చేసి గిరిజనులకు రాజ్యాధికారం దక్కేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.