YS SHARMILA: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వెల్లడించారు. పోలీసులు కేసీఆర్ కు వత్తాసు పలుకుతున్నారని ఆమె మండిపడ్డారు. పాదయాత్ర ఎక్కడ అయితే ఆగిపోయిందో….అక్కడినుంచే ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం పోలీసుల అనుమతి అడుగుతామన్నారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా……యాత్ర చేసే తీరుతామని శపథం చేశారు.
పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముందుస్తుగా ప్రచారం చేస్తున్నారని షర్మిల అన్నారు. పీసీసీ పదవి కాపాడుకోవచ్చనేది రేవంత్ ఉద్దేశమని ఆమె అభిప్రాయపడ్డారు. భాజపాకు మాకు మధ్య గొడవలు ఉన్నాయి….కాబట్టి భాజపాతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.