Home / POLITICS / Politics : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి…

Politics : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి…

Politics టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటనలో చేశారు పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు..

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలా కొనుగోలు విషయంలో ఒకరు దోషగా ఉంటే.. మరొకరు బాధితుడుగా ఉందని అన్నారు.. అధికారా తెరాస నేరం జరిగింది విచారణ మేం జరిపిస్తామంటుంటే బిజెపి అంటుంది.. అయితే సిబిఐ బిజెపి చెప్పినట్టు వింటుంది అలాగే సిట్ బీఆర్ఎస్ చెప్పినట్టు వింటుంది అంటూ చెప్పకు వచ్చారు..

అలాగే ఈ సందర్భంగా ప్రజలను ఈ రెండు పార్టీలు కలిసి వేరే వాళ్లను చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు.. అలాగే పార్టీలు రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. అలాగే 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంకా “ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు? నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat