Politics ఎంతో కాలం నుంచి సెక్షన్లో ఉన్న విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు తాజాగా వివరణ ఇచ్చింది విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ చెప్పుకొచ్చింది.. అలాగే ఇప్పటివరకు మంజూరు చేసిన నిధుల వివరాలు సైతం తెలిపింది..
విశాఖ రైల్వే జోన్ అంశం ఎంతో కాలం నుంచి కొనసాగుతూనే ఉంది అయితే రైల్వే జోన్ ప్రకటించి చాలాకాలం అయినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర రైల్వే బోర్డు ఈ విషయంలో నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ చెప్పుకొచ్చింది..
విశాఖపట్నం రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్లు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించింది. అలాగే 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. అదేవిధంగా కాజీపేటకు కొత్త డివిజన్ను గా ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.. అలాగే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న రైల్వే జోన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది దేశవ్యాప్తంగా 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్న ఏపీలో మాత్రం లేని సంగతి తెలిసిందే.. అలాగే ఏపీలో బోర్డు లేదని.. దీంతో ఉద్యోగాల కోసం, రైల్వే పరీక్షల కోసం సికింద్రాబాద్కు వెళ్లాల్సి వస్తుందని ఏపీ సర్కారు పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనీ తెలిపింది