నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం. ఇదే ఈ ఏడాదికి చివరి గ్రహణం. ఇప్పటికే గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి రాత్రి7:30 వరకు దేవాలయం తలుపులు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. బ్రేక్, వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేశారు.
గ్రహణం టైమ్ ఇదే..
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు గ్రహణం సమయం. ఈ గ్రహణం కొన్ని నగరాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. ఇక హైదరాబాద్లో పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో సాయంత్రం 5.40కు ప్రారంభమై రాత్రి 7.26కు ముగిస్తుంది. ఇక్కడ ఈ గ్రహణం 1 గంట 46 నిమిషాలు ఉంటుందని ప్రముఖులు తెలుపుతున్నారు.