ఇండియన్ ఆర్మీ ఆర్డ్నెన్స్ క్రాప్స్లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 419 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ రీజియన్లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నది. రీజియన్ల వారీగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు.
మొత్తం పోస్టులు: 5149
ఇందులో తెలంగాణ రీజియన్లో 32 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 12
వెబ్సైట్: http://www.aocrecruitment.gov.in