దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,83,360కి చేరాయి. ఇందులో 4,40,13,999 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది కరోనాతో మరణించారు.
మరో 40,750 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 27 మంది వైరస్కు బలవగా, 4474 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.09 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.72 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 218.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.